Monday, September 5, 2011

వినాయక చవితి

         నేడు మనమందరమూ వినాయక చవితి సందర్భముగా చాల చోట్ల వినాయక విగ్రహాలు నిలబెట్టి పండుగను చేసుకుంటున్నాం. కానీ చాలాచోట్ల భక్తి కన్నా ఆడంబరము ఎక్కువ గ కనబడుతుంది.ఎవరో ఒక రాజకీయనాయకుడిని పిలవడం, వారి అనుచరులుతో వారు రావడం వారికీ లేని పోనీ మర్యాదలు చేయడం. ఇదంతా చూస్తుంటే విచిత్రం గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం దేవుడిని నిలబెట్టేది భక్తి ప్రపత్తులతో. అంతే తప్ప ఈ సందర్భాన్ని మన ఆధిక్యతను ప్రదర్శించడానికి కాదు.అక్కడి కార్యకర్తలు కూడా ధనవంతులను ఒక రకం గా మిగిలిన వాళ్ళను వేరొక రకం గా చూడడం మంచిది కాదు. అంతేకాదు ఈ నవ రాత్రుల లో పెట్టె ప్రదర్సనలు మరియు లౌడ్ స్పీకర్ల గోల కూడా భరించడం కష్టమే . నిమజ్జనం టైం లో తాగి తందనాలు ఆడడం చూస్తె చాల ఆవేదన కలుగుతుంది.

No comments:

Post a Comment